మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అక్కడ రోజు రోజుకి కరోనా కేసులు అనదోలన కలిగిస్తూనే ఉన్నాయి... ఇక గత రెండు రోజుల్లో ఆ రాష్ట్రంలో పది వేల కేసులు నమోదు అయ్యాయి. దీనితో కేసుల సంఖ్య లక్షా 50 వేలు దాటింది. ఆ రాష్ట్ర రాజధాని ముంబై లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి అని లెక్కలు చెప్తున్నాయి.
పూణే సహా పలు నగరాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక మరణాలు కూడా ఆ రాష్ట్రంలో పెరుగుతూ పోతున్నాయి. ముంబై లో 27 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి అని ఆ రాహ్స్త్ర ప్రభుత్వం తాజాగా తెలిపింది. నిన్న ఏకంగా 5 వేలకు పైగా కరోనా కేసులు ఆ రాష్ట్రంలో నమోదు అయ్యాయి.