భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు  శత జయంతి విషయంలో... తెలంగాణా కాంగ్రెస్ ని  తెరాస పార్టీ బాగా ఇబ్బంది పెడుతుంది. వాస్తవానికి పీవీ పుట్టి, రాజకీయం చేసింది మొత్తం కాంగ్రెస్ లోనే. ఆయన చివరి వరకు కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆ పార్టీ లోనే ఆయన ప్రధాని అయ్యారు. ఆయనకు పేరు తీసుకొచ్చింది కూడా ఆ పార్టీలోనే. 

 

అయినా సరే ఆయన విషయంలో తెలంగాణా కాంగ్రెస్ మాత్రం ఘోరంగా విఫలం అయింది అని చెప్పాలి. కేసీఆర్ ఏడాది పాటు శత జయంతి ఉత్సవాలను జరపాలి అని నిర్ణయం తీసుకుని పీవీపై తమకు ప్రేమ ఎక్కువగా ఉందని స్పష్టం చెప్పారు. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్. అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా విస్మయం వ్యక్తం చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: