2020 చాలా సమస్యలు తెచ్చింది అని ప్రజలు అనుకుంటున్నారు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు మోడీ. సరిహద్దుల్లో మన బలం ప్రపంచం మొత్తం చూసింది అని మోడీ అన్నారు. భారత్ వద్ద అనేక అత్యాధునిక యుద్ద పరికరాలు ఉన్నాయని మోడీ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. 

 

కష్ట సమయంలో భారత్ సమస్యలను అవకాశాలుగా మార్చుకుంటుంది అని ఆయన చెప్పుకొచ్చారు. రక్షణ రంగంలో మన దేశం అనేక దేశాల కంటే ముందు ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. సమస్యలు వచ్చినప్పుడే మనం చాలా బలవంతులు అవుతామని ఆయన అన్నారు. దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది అని అందరూ ధైర్యంగా నిలబడాలని మోడీ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: