టీడీపీ నేత అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. ఈఎస్ఐ స్కాం కేసులో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడుకు కొన్ని అక్కడే వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అక్కడ వైద్య సిబ్బందికి కరోనా సోకడం టీడీపీ నేతలను టెన్షన్ పెడుతుండగా ఇదే సమయంలో అచ్చెన్నాయుడుకు బీపీ పెరిగి షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి. 
 
అచ్చెన్నాయుడు నడుమునొప్పితో కూడా బాధ పడుతున్నారని తెలుస్తోంది. ఒక వైపు విజృంభిస్తోన్న కరోనా మరోవైపు అచ్చెన్నాయుడు ఆరోగ్యం ఇబ్బందికరంగా మారడంపై తెలుగుదేశం పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేయడంతో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే విషయాలను ఆరా తీస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: