రంగులు వేయడం తప్పని హైకోర్టు తీర్పు ఇస్తే.. దాన్ని సవాల్ చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లిందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య ఆరోపించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన అయన కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 14వ ఫైనాన్స్ నిధులను వైసీపీ ప్రభుత్వం రంగులు వేయడానికి వాడిందని ఆయన ఆరోపించారు. 

 

ఆ న్యాయస్థానం కూడా నెల రోజుల్లో రంగులు మార్చాల్సిందేనని తీర్పు ఇచ్చిందని ఆయన వివరించారు. ఇంత వరకు పట్టించుకోకుండా నిన్న హడావుడిగా రంగులు మార్చమని, దానికి 14వ ఆర్థిక నిధులు మళ్లీ వాడమని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. వేసేదానికి, తీసేదానికి కూడా కేంద్రం స్థానిక సంస్థల అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: