ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు అవినీతి కేంద్రంగా టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. అవినీతి ఆరోపణలను అధికార పార్టీ నేతలు ఇప్పుడు టీడీపీ అధినేత నుంచి సీనియర్ నేతలు, గత ప్రభుత్వంలో పని చేసిన మంత్రుల వరకు టార్గెట్ చేసి చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు. 

 

ఫైబర్ గ్రిడ్ కి అప్పటి ఐటీ మంత్రికి సంబంధం లేదని చిట్టి నాయుడు స్టేట్మెంట్ అంటూ లోకేష్ ని ఉద్దేశించి అన్నారు. ఫైబర్ గ్రిడ్లో అవినీతి జరిగిందన్న విషయాన్ని  కక్కేశాడని ఆయన పేర్కొన్నారు. నీకు కాకపోతే మరి అప్పటి  సీఎం మీ  నాన్నకు ఉందా ? అంటూ ప్రశ్నించారు. తండ్రినే ఇరికిస్తున్నావా చిట్టి అంటూ మండిపడ్డారు. ఈవీఎం దొంగ హరి ప్రసాద్ ని ఐటి సలహాదారుగా ఎవరు పెట్టారో  చెప్పు అని ఆయన నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: