భారత్ చైనా దేశాల మధ్య ఇప్పుడు పరిస్థితులు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. కరోనా కట్టడికి నానా ఇబ్బందులు పడుతున్న వేళ ఇప్పుడు దేశాన్ని చైనా సమస్య ఇబ్బంది పడుతుంది. అయితే ఇప్పుడు విపక్షాలు దీని కేంద్రంగా తీవ్ర విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

చైనా నుంచి భారత భూభాగాన్ని కాపాడేందుకు 20 మంది సైనికులు ప్రాణ త్యాగాలు చేశారని అని ఆయన గుర్తు చేసారు. చైనాను మన భూభాగం నుంచి తరిమికొట్టే సమయం ఇది అని ఆయన పేర్కొన్నారు. మన సైనికుల ప్రాణ త్యాగాలకు ప్రతీకారం తీర్చుకోవాలని మనం కోరుకుంటే అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకేమాటపై నిలబడాలి గాని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే ఫలితం ఎం ఉంటుంది అని ఆయన నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: