ఒక పక్క అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా కేసులు చుక్కలు చూపిస్తుంటే మరో పక్క అక్కడ కాల్పులు ప్రజలను భయపెడుతున్నాయి. ఇటీవల వరుసగా కాల్పుల ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా మరోసారి కాల్పులు సంచలనం సృష్టించాయి. శనివారం సాయంత్రం కాలిఫోర్నియా రాష్ట్రంలోని రెడ్‌ బ్లఫ్ నగరంలో ఉన్న వాల్‌మార్ట్ సెంటర్‌లో ఒక వ్యక్తి సెమీ ఆటోమెటిక్ రైఫిల్‌తో లోపలి వచ్చి కాల్పులు జరిపాడు. 

 

ఆ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓర్లాండ్‌కు చెందిన మార్టిన్ హరో లొజానో ప్రాణాలు కోల్పోయాడు. అదే విధంగా మరో వ్యక్తి కూడా మరణించాడు. నలుగురు తీవ్రంగా  గాయపడ్డారు అని అక్కడి పోలీసులు పేర్కొన్నారు. స్థానికుల సమాచారం ప్రకారం అక్కడికి వచ్చిన పోలీసులు అతన్ని కాల్చి చంపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: