ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్ర సరిహద్దుల్లో రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. తెలంగాణా నుంచి ఏపీ వెళ్తున్న వారిని ఏపీ పోలీసులు అడ్డుకోవడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దాదాపు అన్ని చెక్ పోస్ట్ ల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. తాజాగా  పొందుగుల చెక్ పోస్ట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. 

 

వందలాది మంది వాహనదారులు తమకు ఏ మాత్రం సమాచారం లేకుండా ఆపివేశారు అని మండిపడుతున్నారు. కనీస సమాచారం లేకపోవడంతో ఇప్పుడు ఎం చెయ్యాలి అని నిలదీస్తున్నారు. ఇక ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న సంగతి తెలిసిందే. నేడు ఏకంగా 800 పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వ౦ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి పట్ల జాగ్రత్త పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: