దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన తమిళనాడు తండ్రి, కొడుకుల లాకప్​డెత్​ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టుకు నివేదిస్తామని వెల్లడించింది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తమిళనాడు ట్యూరికొరిన్ చెందిన తండ్రి, కొడుకుల లాకప్​ డెత్​కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం.


ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టుకు తెలుపుతామని చెప్పారు. కేసును సీబీఐకి బదిలీ చేసేముందు కోర్టు అనుమతి తీసుకుంటామని స్పష్టం చేశారు.

లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి.. వారి సెల్​ఫోన్ దుకాణాన్ని తెరిచినందుకు పి. జయరాజ్, ఫెనిక్స్​లను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు. అనంతరం వారు కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై కారణమైన ఇద్దరు ఎస్​ఐలను, నలుగురు పోలీసు సిబ్బందిని ఇప్పటికే సస్పెండ్ చేశారు.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: