శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం బొబ్బిలి పేట గ్రామంలో భూవివాదం కారణంగా జరిగిన ఘర్షణలో ఒకరు మృతిచెందారు. అన్నదమ్ముల మధ్య గొడవలో అన్న కుమారుడు, బాబాయి అయిన వేణుగోపాల్​ను గట్టిగా తోయటంతో ఆయన కుప్పుకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

 

 

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం బొబ్బిలి పేట గ్రామంలో భూవివాదం కారణంగా జరిగిన ఘర్షణలో ఒకరు మృతిచెందారు. వేణుగోపాల్​రావును తన అన్న కుమారుడు కూర్మారావు నెట్టటంతో వేణుగోపాల్ కిందపడి అపస్మారక స్థితికి వెళ్లారు. ఆయనను శ్రీకాకుళం సరోజ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరిశీలించి వేణుగోపాల్ మృతిచెందారని తెలిపారు. మృతుని భార్య సీతమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆమదాలవలస ఎస్ఐ ఏ కోటేశ్వరరావు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: