తెలుగు రాష్ట్రాల్లో పలు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను ప్రకాశం జిల్లా అద్దంకి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, ల్యాప్​టాప్, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

 

 

ప్రకాశం జిల్లా అద్దంకిలో ఈనెల 6న దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా ఇంతకుముందు పలు ప్రాంతాల్లో చోరీకి పాల్పడినట్లు అంగీకరించారని తెలిపారు. వారి నుంచి సుమారు రూ.6 లక్షల విలువ చేసే కారు, ల్యాప్​టాప్, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

 

వీరిని అంతర్రాష్ట్ర దొంగలు కోసూరు శ్రీనివాసరావు, శంకర్ నాయక్​లుగా గుర్తించారు. వీరిపై రెండు తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాల కేసులు ఉన్నట్లు వివరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: