Naresh

తాటి చెట్టు మీది నుంచి పడి గీతకార్మికుడు మృతి చెందిన ఘటన... జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుర్రంపేట్​లో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వాన్ని ఆదుకోవాలని సర్దార్ సర్వాయి పాపన్న మోకు దెబ్బ నాయకులు విజ్ఞప్తి చేశారు.

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుర్రంపేట్​కు చెందిన తాల్లపెళ్లి ఇదయ్య గౌడ్ అనే గీత కార్మికుడు తాటి చెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇదయ్య కుటుంబాన్ని సర్దార్​ సర్వాయి పాపన్న మోకుదెబ్బ వ్యవస్థాపకుడు జక్కే వీరస్వామిగౌడ్ పరామర్శించారు. గీతకార్మికుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు కుందనపెళ్లి బుచ్చన్న గౌడ్, బొమ్మిడి గణపతి రాజ్​ గౌడ్, ఇళ్లందకుంట మండల యూత్​ ప్రధాన కార్యదర్శి తోడేటి రాకేష్ గౌడ్, గీత కార్మికులు ఉన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: