ఎన్సీపీ కీలక నేత శరద్ పవార్ కి తృటిలో ప్రమాదం తప్పింది, శరత్ పవర్ కాన్వాయ్ లోని ఓ వాహనాన్ని బోల్తా పడింది. ముంబై పూణే మధ్య ఉన్న ఎక్స్ప్రెస్ హైవే పై కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఇక శరద్ పవార్ ప్రయాణిస్తున్న కారు కాస్త ముందుగా వెళ్లడంతో ఆయనకు ప్రమాదం తప్పింది. ఇక ఈ ప్రమాదంలో జీపు లోని డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి, ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.