దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని రాష్ట్రాల్లో వైరస్ క్రమంగా తగ్గుముఖం పాడుతోంది. గడిచిన 24 గంటల్లో హిమాచల్ ప్రదేశ్ లో కేవలం 3 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 919 కేసులు నమోదు కాగా ప్రస్తుతం 365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 534 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా ఏడుగురు మృతి చెందారు.
వైద్య, ఆరోగ్య శాఖ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. ఐదు రోజుల క్రితం 128 కేసులు హిమాచల్ ప్రదేశ్ లో నమోదు కాగా ప్రస్తుతం కేసుల సంఖ్య 3కు తగ్గడం గమనార్హం. ప్రభుత్వ కృషితో పాటు ప్రజలు కరోనా సోకకుండా తీసుకున్న జాగ్రత్తల వల్లే వైరస్ తగ్గుముఖం పడుతున్నట్టు తెలుస్తోంది. కేసుల సంఖ్య తగ్గినా రాష్ట్ర ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు చేపడుతోంది.
Himachal Pradesh detects 3 new positive cases of #COVID19, taking the total number of positive cases in the state to 919 including 365 active cases, 534 recoveries and 7 deaths: State health Department pic.twitter.com/aTDqitvqo7
— ANI (@ANI) June 29, 2020