ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎంతో మంది ఈ మహమ్మారి వైరస్ బారినపడి ఎంతగానో మనస్తాపం చెందుతున్నారు. కొంతమంది కరోనా సోకి ఎక్కడ తమ ప్రాణాలు పోతాయో అని భావించి ముందుగానే ఆత్మహత్య చేసుకుని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
తాజాగా ఓ కరోనా బాధితులు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తమిళనాడులోని మధురై పలగనాదమ్ కు చెందిన ధనుష్ అనే 56 ఏళ్ళ ఇటీవలే కరోనా వ్యాధి బారిన పడ్డాడు. దీంతో అతన్ని ఐసోలేషన్ వార్డులో తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కాగా ఆ క్యాంప్ లోని మొదటి అంతస్తు నుంచి దూకి ధనుష్ ఆత్మహత్యయత్నం చేయగా అతని గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు,