విశాఖ పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్​ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి దాటాక రియాక్టర్ నుంచి బెంజిన్​ లీక్​ అయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా​.. నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని గాజువాక ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఇద్దరు వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నారు. 

 

 

సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్​ వినయ్​చంద్​, సీపీ ఆర్కే మీనా ఫార్మా సంస్థను  సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరు, భద్రతా లోపాలను పరిశీలించారు. పరిసర ప్రాంతాలపై ఏమైనా ప్రభావం ఉందా అనేది పరిశీలిస్తున్నారు.

 

 

సాయినార్​ కంపెనీపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్లు విశాఖ సీపీ ఆర్కే మీనా తెలిపారు. బాయిలర్​లో తెల్లవారుజామున లోపం తలెత్తి గ్యాస్​ లీకైనట్లు వివరించారు. మృతుల్లో షిఫ్ట్ ఇన్‌ఛార్జి నరేంద్ర, మరో వ్యక్తి ఉన్నట్లు చెప్పారు. మూడేళ్ల క్రితం ఇదే సంస్థలో రియాక్టర్‌ పేలి ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. గతంలో జరిగిన ప్రమాదంపైనా విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: