విశాఖ పరవాడలో సైనార్ లైఫ్ సైన్సెస్ లో గ్యాస్ లీక్ ఘటనపై సిఎం వైఎస్ జగన్ ఆరా తీసారు. జిల్లా కలెక్టర్ సహా ఎస్పీలను అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి అని సిఎం ఆదేశించారు. ఇక ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది. జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీ వేసింది.
రాత్రి 11;30 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది అని సమాచారం. ఇక ఈ ఘటనలో గ్యాస్ లీక్ తీవ్రత కేవలం కంపెనీ కి మాత్రమే పరిమితం అయింది అని అధికారులు చెప్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ప్రకటించారు. తాము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇక స్థానికుల్లో భయం వ్యక్తమవుతున్న నేపధ్యంలో వారికి ధైర్యం నింపాలి అని సిఎం సూచించారు.