జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను ఏరివేసే విషయంలో పోలీసు, భద్రతా బలగాలు దూకుడు గా వ్యవహరిస్తున్నాయి. తాజాగా అక్కడ మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపినట్టు తెలుస్తుంది. అనంతనాగ్ లోని వాఘామా ప్రాంతంలో ఎన్కౌంటర్ ప్రారంభమైందని అధికారులు  పేర్కొన్నారు. 

 

జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు ఈ ఆపరేషన్ లో ఉన్నాయని కాశ్మీర్ జానే పోలీసులు వెల్లడించారు. గత వారం రోజులుగా ఉగ్రవాదుల కదలికలు ఎక్కువ కావడంతో నిఘా వర్గాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. సరిహద్దుల్లో ఏ విధంగా కూడా ఉగ్రవాదులకు అవకాశం ఇవ్వడం లేదు భారత బలగాలు. తాజాగా జరుగుతున్న ఆపరేషన్ లో కీలక ఉగ్రవాదులను కాల్చి చంపారు అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: