మరోసారి సాగర తీరం విశాఖ ఉలిక్కిపడింది. ఎల్జీ పాలీమర్స్ ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది విశాఖలో సాయినార్ అనే ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయ్యాయి. బెంజ్ మిడజోల్ అనే వాయువు లీక్ కావడంతో ఇద్దరు మరణించారు. నలుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. ఇక ఈ కంపెనీపై పోలీసులు కేసు కూడా నమోదు చేసారు. 

 

ఎలాంటి ఆందోళన అవసరం లేదు అని అధికారులు పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే మూడేళ్ల క్రితం ఇదే సంస్థలో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం కంపెనీలోని ఒక విభాగ౦కు మాత్రమే పరిమితం అని అధికారులు వెల్లడించారు. ఎవరూ కూడా ఆందోళన చెందవద్దు అని పరిస్థితి అదుపులోని ఉంది అని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: