ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల విషయంలో ఇప్పుడు విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి విపక్షాలు. కొన్ని చోట్ల ఇళ్ళ పట్టాల విషయంలో రాజకీయ నాయకుల జోక్యం కాస్త చికాకుగా మారింది రాష్ట్ర ప్రభుత్వానికి. తాజాగా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు.  

 

మైలవరంమండలం చండ్రగూడెం గ్రామంలో "సెంటుభూమి" పథకం పేరుతో మీ ప్రజా ప్రతినిధులు అధికారులను అడ్డం పెట్టుకొని నలభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న దళితరైతుల భూములు లాక్కుంటున్నారని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఆ రైతుల ఆర్తనాదాలు తాడేపల్లి రాజ ప్రసాదానికి వినబడడంలేదా వైఎస్ జగన్ గారూ అంటూ సిఎం జగన్ ని ఆయన ట్యాగ్ చేసారు. వారిపై ఏంచర్యలు తీసుకున్నారో చెప్పండని  ఉమా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: