ప్రశాంతంగా ఉండే కృష్ణా జిల్లా బందరు తీరం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. అక్కడ జరిగిన ఒక హత్య సంచలనంగా మారింది. వైసీపీనేత,  మంత్రి పెర్ని నానీ ప్రధాన అనుచరుడు మోకా భాస్కరరావు మరణం తో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. మోకా భాస్కర్ రావు మృతదేహానికి నేడు అంత్యక్రియలు జరుగనున్నాయయని పోలీసులు వెల్లడించారు. 

 

దీనితో ఏ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. బందరులోని పలు ప్రధాన కూడళ్ళలో పోలీస్ పికెటింగ్ ని అధికారులు ఏర్పాటు చేసారు. ఈ హత్యతో సంబంధం ఉన్న ముగ్గురు నిందితులు గూడూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక టీడీపీ నేతల ఇళ్ళ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసారు అధికారులు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: