ఆంధ్రప్రదేశ్ లో 108 వాహనాలు ఇప్పుడు కొత్తవి సిద్దం చేసింది ఏపీ సర్కార్. వెయ్యికి పైగా వాహనాలను రేపటి నుంచి అందుబాటులోకి తీసుకుని రానున్నారు. ఎక్కడా కూడా రాజీ లేకుండా ఈ విషయంలో సిఎం జగన్ కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రేపటి నుంచి అందుబాటులోకి రానున్న నేపధ్యంలో ఇప్పుడు వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా ఈ కార్యక్రమం పై తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. 

 

దీనిపై ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేసారు. “కుయ్ ... కుయ్... కుయ్... ఈ మాట వింటే చాలు ప్రజల్లో ఒక భావోద్వేగం. ఇప్పుడు 108 వాహనాలకు మళ్లీ పూర్వవైభవం. సరికొత్త హంగులతో 108,104 వాహనాలు, జగన్ గారి హయాంలో పేదల చెంతకే వైద్యం. మరోసారి వైఎస్ఆర్ ను గుర్తు చేసుకుంటున్న ఆంద్ర ప్రజలు.” అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: