ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేతలు కొందరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కృష్ణా జిల్లాకు చెందిన ఒక నేతను, అదే విధంగా గోదావరి జిల్లాలకు చెందిన ఒక ఎంపీని, గుంటూరు జిల్లాకు చెందిన ఒక నియోజకవర్గ స్థాయి కీలక నేతను... విశాఖ జిల్లాకు చెందిన ఒక నేతను సస్పెండ్ చేసే అవకాశం ఉందన్న సమాచారం వినిపిస్తోంది.
పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దు అని ఎన్ని సార్లు అధిష్టానం నుంచి సూచనలు వెళ్తున్నా సరే అధికార పార్టీ నేతల తీరులో ఏ మార్పు రావడం లేదు. దీనితో సస్పెండ్ చేయడమే మంచిది అనే ఆలోచనలో అధిష్టానం ఉంది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిన ఓ ఎంపీని రేపో మాపో సస్పెండ్ చేసేస్తారని.. ఆయన కూడా బీజేపీలోకి వెళ్లే ఏర్పాట్లలో ఉన్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.