ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  గత 24 గంటల్లో  ఏపీలో 700 కేసులకు పైగా నమోదు అయ్యాయి.  గత 24 గంటల్లో ఏపీలో 704 కరోనా కేసులు నమోదు కాగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 51 మందికి కరోనా సోకింది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో 5 మందికి కరోనా సోకింది. 

 

గత 24 గంటల్లో 18 వేల 114 మందికి కరోనా పరిక్షలు చేసారు. అత్యధికంగా చిత్తూరులో 107 కేసులు వచ్చాయి. అనంతపురంలో 104 మందికి కరోనా సోకింది. ఏడుగురు కరోనా కారణంగా మరణించారు. యాక్టివ్ కేసులు 7897 ఉన్నాయి. మొత్తం 187 మంది కరోనా కారణంగా మరణించారు. మొత్తం కేసులు 14 వేల 595 కి చేరుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: