కరోనా దెబ్బకు అనంతపురం జిల్లా అల్లాడిపోతుంది. కరోనా కేసులు ప్రతీ రోజు కూడా అక్కడ భారీగా నమోదు అవుతూనే ఉన్నాయి.  నేడు ఏకంగా వందకు పైగా కరోనా కేసులు వచ్చాయి. ఇక చిత్తూరు జిల్లాలో కూడా కరోనా కేసులు భారీగానే నమోదు అవుతున్నాయి. అక్కడ నిన్న ఒక్క రోజే రికార్డ్ స్థాయిలో 107 మందికి కరోనా వచ్చింది. 

 

అనంతపురం జిల్లాలో కరోనా 104 మందికి గత 24 గంటల్లో సోకింది. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 84 కేసులు వచ్చాయి. అనంతపురంలో ఇప్పటి వరకు 1571 మందికి కరోనా సోకగా అత్యధికంగా కర్నూలు జిల్లాలో 1955 కి చేరుకున్నా  కేసులు. రేపటితో రెండు వేలు అయినా సరే ఆశ్చర్యం లేదంటున్నారు. అక్కడ నిన్న 82 కేసులు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: