మహారాష్ట్రలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇక మహారాష్ట్ర పోలీసుల్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. అక్కడ కరోనా కట్టడికి ఎంత సమర్ధవంతంగా ఉన్నా సరే పోలీసుల్లో మాత్రం కరోనా కేసులు ఆగడం లేదు. ఇక ఇదిలా ఉంటే అక్కడి పోలీసుల్లో మరోసారి భారీగా కేసులు నమోదు అయ్యాయి. 

 

గత 24 గంటల్లో మరో 67 మంది మహారాష్ట్ర పోలీసు సిబ్బందికి కరోనా సోకిందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. మహారాష్ట్ర పోలీసుల్లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4810 కు చేరుకుంది. ఇక మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 59 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: