ఇప్పుడు మాస్క్ ధరించడం అనేది చాలా అవసరం. కాని మాస్క్ ధరించే విషయంలో చాలా మంది వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. రోజు రోజుకి కరోనా తీవ్రతరం కావడంతో ఇప్పుడు మాస్క్ అనేది చాలా అవసరంగా మారింది. అయితే ఒక వ్యక్తిని మాస్క్ పెట్టుకోవాలి అని కోరినందుకు గానూ... నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ ఒక లేడీ కాంట్రాక్ట్ ఉద్యోగినిని(ఉషారాణి) ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. 

 

దీనికి సంబంధించిన వీడియో అక్కడ ఉన్న సిసిటీవీ లో రికార్డ్ అయింది. ఆమెపై ఇనుప రాడ్ తో అతను దాడి చేసాడు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ వీడియో ని పలువురు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సిఎం జగన్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: