విశాఖ సాయినార్ లైఫ్ సైన్సెస్ లో జరిగిన గ్యాస్ లీక్ ప్రమాదం ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎల్జీ పాలీమర్స్ ఘటన మరువక ముందే తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆగ్రహంగానే ఉంది. సిఎం జగన్ కూడా విచారణకు ఆదేశాలు ఇచ్చారు. ఇక విపక్షాలు అయితే దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేసారు. లైఫ్ సైన్సెస్ గ్యాస్ లీక్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి 2 వ్యక్తులు కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను అని ఆయన ట్వీట్ చేసారు. ఏపీ ప్రభుత్వం నుండి సరైన చర్యలు లేకపోవడంతో నిర్లక్ష్యం కారణంగా గ్యాస్ లీకేజీలు సాధారణ లక్షణంగా మారాయి. తప్పు చేసిన సంస్థలపై వెంటనే చర్య తీసుకోవలసిన సమయం ఇది అంటూ ఆయన పేర్కొన్నారు.
My heartfelt condolences to the families of the 2 individuals who’ve lost their lives in the gas leak at Sainor Life Sciences in #Vizag. Gas leakages have become a regular feature owing to lack of action and alacrity from the ap Govt. Time to act promptly on erring companies
— N chandrababu naidu #StayHomeSaveLives (@ncbn) June 30, 2020