కరోనా రాక్షసి కారణంగా సామాన్య ప్రజలు సెలబ్రిటీలే కాదు దేశానికి రక్షణ కల్పిస్తున్న జవాన్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రమక్రమంగా ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్న జవాన్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. 

 

 ఇప్పటికే సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ దళాలపై  ప్రాణాంతకమైన మహమ్మారి కరోనా పంజా విసురుతోంది. అంతేకాకుండా బార్డర్  సెక్యూరిటీ ఫోర్స్ లో కూడా ఈ మహమ్మారి శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 53 మంది జవాన్లు మహమ్మారి వైరస్ బారిన పడ్డారని తెలిపారు అధికారులు. ప్రస్తుతం 354 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 659 మంది కోలుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: