వైసీపీ మంత్రి పేర్ని నాని అస్వస్థతకు గురయ్యారు. నిన్న వైసీపీ నేత భాస్కర్ రావు అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన ఇంటికి వెళ్లిన తరువాత స్పృహ తప్పి పడిపోయారని తెలుస్తోంది. సోమవారం రోజున వైసీపీ నేత మోకా భాస్కర్ రావు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. మరణ వార్త విన్న వెంటనే షాక్ కు గురైన పేర్ని నాని మృతదేహాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని తెలుస్తోంది. 
 
కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో వైసీపీ నేత మోకా భాస్కరరావు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని ముగ్గురు నిందితులను గుర్తించారు. చింత పులి అనే వ్యక్తి కత్తితో హత్య చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు ఈ కేసుకు సంబంధించిన సీసీ ఫుటేజీ విడుదల చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: