ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్ చేస్తూ ఉంటారు  వైసీపీ కీలక నేత పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి. తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి తమది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అంటూ చెప్పడం కన్నా చేసి చూపించడమే మిన్న  అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. 

 

 పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ప్రస్తుతం పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి అంటూ తెలిపిన విజయసాయిరెడ్డి.. గతంలో మీడియా హడావిడి తప్ప క్షేత్రస్థాయిలో పనులు జరగలేదు అని విమర్శించారు, గతంలో పనులు తక్కువ చేసి చంద్రబాబు ప్రచారం ఎక్కువ చేసుకుంటే ప్రస్తుతం వైయస్ జగన్ మాత్రం పనులు సైలెంట్గా చేసుకు పోతున్నారు  అంటూ పేర్కొన్నారు విజయసాయిరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: