అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, ఈరోజు ఉదయం తాడిపత్రి సమీపంలోని కడప రహదారి పై రెండు లారీలు వేగంగా ఢీకొన్నాయి, దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఓ లారీ డ్రైవర్ సజీవదహనం అయ్యాడు, కడప నుంచి బొగ్గులతో తాడిపత్రి వైపు వస్తున్న వాహనం.. వరి పొట్టు లోడుతో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ దారుణ ఘటన జరిగింది. 

 

 ప్రమాదంలో మరో లారీ లోని ఇద్దరు వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఎంతగానో శ్రమించారు. క్షతగాత్రులను తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

మరింత సమాచారం తెలుసుకోండి: