చంద్రబాబు 2.45 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని నిలువునా ముంచారు అని మంత్రి బొత్సా సత్యనారాయణ ఆరోపించారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటే ఇదేనా అని ఆయన నిలదీశారు. రేపు పెద్ద ఎత్తున 108 అంబులెన్స్ లను ప్రారంభిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 30 లక్షల ఇళ్ళ పట్టాలు ఇస్తుంటే అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆయన మండిపడ్డారు. 

 

మీ మాటలను అసలు ప్రజలు వింటారా అని ఆయన ప్రశ్నించారు. అసలు దేశంలో ఇన్ని కరోనా పరిక్షలు ఏ రాష్ట్రం అయినా చేసిందా అంటూ ఆయన నిలదీశారు. సూక్ష్మ కంపెనీలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు చంద్రబాబు ఇవ్వలేదు అని బొత్సా ఆరోపించారు. చంద్రబాబు చేసిన బకాయిలు అన్నీ కూడా తాము అధికారంలోకి వచ్చి తీర్చామని బొత్సా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: