ఈ మద్య మానవ సంబంధాలు దారుణంగా మారిపోతున్నాయి. క్షణికావేవంలో ఐన వారినే అంతం చేస్తున్నారు.  చిన్న చిన్న గొడవలతో సొంత వారిని... స్నేహితులను హతమార్చుతున్నారు. తాజాగా  నిజామాబాద్​లోని నాందేవ్ వాడకు చెందిన రూపేశ్​, సతీశ్​లు అన్నదమ్ములు. సతీశ్​ రోజూ మద్యం తాగి ఇంట్లో గొడవలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో  సతీశ్​ మద్యం తాగొచ్చి అన్న రూపేశ్​తో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన రూపేశ్, తమ్ముడిని​ బండరాయితో కొట్టి హతమార్చాడు. 

 

అనంతరం తల్లి మమతతో కలిసి​ హత్యను సహజ మరణంగా చిత్రీకరించి అంత్య క్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని ఆటోలో శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.మూడో పట్టణ సీఐ సత్యనారాయణ, ఎస్సై సంతోశ్​లు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు.

 

అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో రూపేశ్​, సతీశ్​ను బండరాయితో కొట్టి చంపాడని సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు. శ్మశాన వాటిక సిబ్బంది సమాచారంతో విషయం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు నిందితులు రూపేశ్​, తల్లి మమతలను అరెస్టు చేసినట్లు వివరించారు

మరింత సమాచారం తెలుసుకోండి: