తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 945 కేసులు నమోదు కాగా ఏడుగురు మృతి చెందారు. నమోదైన కేసుల్లో 865 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలో ఒక్కరోజే 1,712 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 8,785 యాక్టివ్ కేసులు ఉండగా 7,924 మంది ఇప్పటివరకు వైరస్ నుంచి కోలుకుని మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,339కు చేరగా 260 మంది మృతి చెందారు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ప్రభుత్వం కేసులు ఎక్కువగా నమోదవుతున్న హైదరాబాద్ లో లాక్ డౌన్ విధించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: