తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కంటైన్మేంట్ జోన్లలో లాక్ డౌన్ ని ఈ నెల 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణా సర్కార్. ఈ మేరకు తాజాగా ఒక జీవో ని కూడా విడుదల చేసింది. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చెయ్యాలి అని కలెక్టర్ లకు ఆదేశాలు ఇచ్చింది. 

 

రాత్రి పది నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ని అమలు చేస్తారు. 9;30 నిమిషాలకు షాపులు అన్నీ మూసి వెయ్యాలి అని ఆదేశాలు ఇచ్చింది. లాక్ డౌన్ కి సంబంధించిన నూతన గైడ్ లైన్స్ ని తెలంగాణా సర్కార్ కలెక్టర్లకు పంపించింది. తక్షణం అమలులోకి రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: