ఒక పక్క ఉగ్రవాదులను వరుసగా కాల్చి చంపుతున్నా సరే భారత బలగాల మీద దాడులు మాత్రం ఆపడం లేదు. ఎక్కడో ఒక చోట దాడులు చేస్తూనే ఉన్నాయి ఉగ్రవాద మూకలు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జమ్మూ & కాశ్మీర్లోని సోపోర్లో సిఆర్పిఎఫ్ పెట్రోలింగ్ పార్టీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్  లు ప్రాణాలు కోల్పోయారు. 

 

వారితో పాటుగా మరో పౌరుడు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉగ్రవాదులకు భారత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. సోపోర్‌లోని మోడల్ పట్టణంలో నాకా పార్టీపై ఉగ్రవాదులు దాడి చేశారని అధికారులు పేర్కొన్నారు. ఈ కాల్పులకు దిగింది ముగ్గురు ఉగ్రవాదులు అని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: