ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్క రోజే దాదాపు 1100 అంబులెన్స్ లను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద సిఎం వైఎస్ జగన్ వాటిని ప్రారంభిస్తారు. ఈ నేపధ్యంలో విపక్ష తెలుగుదేశం 108 అంబులెన్స్ లో జరిగిన అవినీతిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా రెస్పాండ్ అయ్యారు. 

 

300 కోట్లు కొట్టేసిన 108 ప్రారంభోత్సవం, మీ జన్మదినం ఒకే రోజు రావడం యాదృచ్చికమా? లేక మీరు వేసిన రివర్స్ టెండర్ కి అల్లుడు ఇచ్చిన రిటర్న్ గిఫ్టా? ఇప్పటికైనా ఆలస్యం కాదు మారు మనస్సు పొంది దొంగ లెక్కల చిట్టా బయటపెట్టాలని కోరుకుంటూ విజయసాయి రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: