జాతీయ వైద్యుల దినోత్సవం నేపధ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేసారు. కుటుంబాలకు దూరంగా, ప్రాణాంతక కరోనాకు దగ్గరగా ఉంటూ విధి నిర్వహణ అన్నట్టుగా కాకుండా, సేవాభావంతో, సామాజిక బాధ్యతతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తోన్న డాక్టర్లందరికీ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గౌరవాభివందనాలు తెలియజేస్తున్నాను. 

 

వైద్యులు ఇలా ప్రాణాలకు తెగించి సేవలందిస్తోంటే... వైసీపీ ప్రభుత్వం వారి  సేవలను ఏమాత్రం గుర్తించకపోగా పైగా అవమానాలకు గురిచేయడం దురదృష్టకరం. డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి ఉదంతాలే ఇందుకు నిదర్శనం. కరోనాకు ఎదురు నిలిచి పోరాడుతున్న డాక్టర్లు పీపీఈ కిట్లు, మాస్కుల కోసం ప్రభుత్వంతో పోరాడాల్సి రావడం దురదృష్టకరం. ఇకనైనా ప్రభుత్వం డాక్టర్ల సేవలను గుర్తించి గౌరవించాలి. వారి సమస్యలను పరిష్కరించాలి. డాక్టర్లను వేధించిన వారిపై చర్యలు తీసుకోవాలి...” అని లోకేష్ ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: