ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 108 కొత్త వాహనాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 201 కోట్లతో... 1088 కొత్త 108, 104 వాహనాలను ఏపీ సర్కార్ ప్రారంభించింది. సిఎం వైఎస్ జగన్ విజయవాడ బెంజ్ సర్కిల్ లో జెండా ఊపి వాటిని ప్రారంభించారు. దీనిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. పాత వాహనాలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. 

 

ఈ నేపధ్యంలోనే ఆర్ధిక లోటు ఉన్నా సరే కొత్త వాహనాలకు ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రతీ మండలానికి కూడా ఒక అంబులెన్స్ ఉంటుంది అని ఏపీ సర్కార్ ప్రకటించింది. దీనిపై ప్రముఖ యువ సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేసారు.  మంచి కార్యక్రమం అని కొనియాడుతూ గాడ్ బ్లెస్ యూ అంటూ పోస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: