ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజాప్రతినిధులు ప్రజలకు సూచనలు చేస్తున్నారు. మాటల్లో మాత్రమే కాక వాళ్లు నిబంధనలు పాటిస్తూ ప్రజలు నిబంధనలు పాటించేలా చేయడానికి కృషి చేస్తున్నారు. తాజాగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి 108, 104 సర్వీసుల ప్రారంభోత్సవం కార్యక్రమంలో మాస్క్ పెట్టుకుని కనిపించారు. 
 
జగన్ మాస్క్ పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీఎం జగన్ ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను ఈరోజు ఉదయం 9.30 గంటలకు విజయవాడ నడిబొడ్డున బెంజ్‌ సర్కిల్‌లో జెండా ఊపి ప్రారంభించారు. 108 సర్వీసుల్లో అత్యాధునిక వైద్య సేవలందించే ఏర్పాట్లు చేశారు.అంబులెన్స్‌లలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు అమర్చారు 

మరింత సమాచారం తెలుసుకోండి: