వైసీపీ నేత పీవీపీకి తెలంగాణా హైకోర్ట్ ఊరట ఇచ్చింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఉన్న ఒక విల్లా విషయంలో ఒక వ్యక్తితో ఆయనకు ఇటీవల వివాదం తలెత్తింది. ఈ నేపధ్యంలో సదరు వ్యక్తిపై ఆయన దాడి చేసాడు అనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపధ్యంలో ఆయనను విచారణకు రావాలి అని పోలీసులు ఆదేశించారు. 

 

కాని ఆయన మాత్రం మీరుగా హైకోర్ట్ కి వెళ్లి పిటీషన్ పెట్టుకోవడంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఆయనను అరెస్ట్ చేయవద్దు అని హైకోర్ట్ ఆదేశించింది పోలీసులను. దీనితో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. ఇక హైకోర్ట్  అలా తీర్పు ఇచ్చిందో లేదో ఆయన హుటాహుటిన హైదరాబాద్ వచ్చేశారు. కాగా ఇటీవల ఆయన పోలీసులపై కుక్కలను కూడా వదిలారు అనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: