ముంబై లో కరోనా కేసులు ఇప్పుడు పోలీసులను ఎక్కువగా భయపెడుతున్నాయి. అక్కడ రోజు రోజు కి కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇక పోలీసులకు కూడా కరోనా రావడంతో ఇప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. కరోనా కట్టడిలో పోలీసులు కీలకం. వాళ్లకు ఇప్పుడు కరోనా సోకడంతో ఇప్పుడు విధులకు హాజరు కావాలి అంటే చాలు భయపడుతున్నారు. 

 

ఈ నేపధ్యంలోనే మహారాష్ట్రలో ఆరుగురు పోలీసులు కరోనాకు భయపడి విధులకు హాజరు కాలేదు. నోటీసు ఇచ్చినప్పటికీ గత 2 నెలల నుండి విధులకు రిపోర్ట్ చేయనందుకు ఆరుగురు పోలీసు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేయబడిందని ముంబై పోలీసులు వెల్లడించారు. వారు కరోనాకు భయపడి రావడం లేదని అధికారులు అంటున్నారు. మహారాష్ట్రలో 5 వేల మంది పోలీసులకు కరోనా సోకింది.

మరింత సమాచారం తెలుసుకోండి: