గాంధీ ఆస్పత్రిలో ఇప్పుడు విషాదకర దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. గాంధీ ఆస్పత్రిలో కరోనా తో జాయిన్ అయి వారు అందరూ కూడా ఇప్పుడు కోలుకుని... ఇంటికి వెళ్ళాలి అని చూస్తుంటే వారిని మాత్రం ఇంటికి తీసుకుని వెళ్లడానికి ఎవరూ కూడా ముందుకు రావడం లేదు. దీనితో ఒక్కసారిగా అక్కడ రోగుల సంఖ్య పెరుగుతుంది. 

 

వారిని ఇంటికి తీసుకుని వెళ్ళే వారు లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాని స్థితి లో ఉన్నారు. దాదాపు 50 మంది రోగులు ఇదే బాధ పడుతున్నారు. వారు అందరిని ప్రత్యేక వార్డ్ కి తరలించారు గాంధీ వైద్యులు. ముఖ్యంగా బస్తీలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. దీనితో ఇప్పుడు నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: