ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే సిఎం జగన్ సంక్షేమ కార్యక్రమాల విషయంలో గాని, పేదలకు అందించే వాటిలో గాని ఏ విధంగా కూడా లోటు చేయడం లేదు అనే సంగతి అందరికి తెలిసిందే. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే ఆయన అమలు చేసే కార్యక్రమాలను దూకుడుగా అమలు చేస్తున్నారు. తాజాగా మరో కార్యక్రమం ఆయన ప్రవేశ పెట్టారు. 

 

ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా 108 వాహనాలను 1100 వరకు ప్రవేశ పెట్టారు. దీనిపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. ఏపీ సర్కారుపై ప్రముఖ జర్నలిస్ట్ సర్దేశాయ్ ప్రశంసల జల్లు కురిపించారు. క్లిష్ట సమయంలో కొత్త 108, 104 అంబులెన్సు సర్వీసులను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తాను అభినందిస్తున్నా అని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: