ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ప్రతిష్టాత్మక గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవల విషయంలో కీలక అడుగు వేసిన సంగతి తెలిసిందే. ఆంకాలజీ విభాగాన్ని సిఎం జగన్ నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ నేపధ్యంలో ఆయన ట్విట్టర్ వేదిక ఒక పోస్ట్ చేసారు. ఏపీ చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణ అధ్యాయంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
ఒకేసారి 1088 సంఖ్యలో అధునాతన 104, 108 సర్వీసు వాహనాలను, గుంటూరు జీజీహెచ్ లో క్యాన్సర్ కేర్ సెంటర్ ను ప్రారంభించడం గొప్ప ఆనందాన్నిస్తోందని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రతి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం మనదని మొత్తం దేశం చూసేలా చాటిచెప్పామని సిఎం పోస్ట్ చేసారు. త్వరలోనే కర్నూలులో కూడా క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
ఏపీ చరిత్రలో ఈ రోజు ఒక సువర్ణఅధ్యాయంగా నిలుస్తుంది. ఒకేసారి 1088 సంఖ్యలో అధునాతన 104, 108 సర్వీసు వాహనాలను, గుంటూరు జీజీహెచ్ లో క్యాన్సర్ కేర్ సెంటర్ ను ప్రారంభించడం గొప్ప ఆనందాన్నిస్తోంది. ప్రతి ప్రాణానికి విలువనిచ్చే ప్రభుత్వం మనదని మొత్తం దేశం చూసేలా చాటిచెప్పాం#DoctorsDay pic.twitter.com/D8wATBP6wm
— jagan MOHAN REDDY' target='_blank' title='ys jagan mohan reddy-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ys jagan mohan reddy (@ysjagan) July 1, 2020