తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఏపికి ప్రత్యక హోదా కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతగానో పోరాడారని.. కానీ కేంద్రం మాత్రం ఇచ్చిన మాట తప్పి విముఖత చూపించిందని  ఏపీకి ఆ హోదా రావడం కష్టమని కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తేల్చేశారు.  ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనపై ఆశలు అడుగంటిపోతున్నాయి. విపక్షాలే, కాదు అధికార పక్షం కూడా అది సాధ్యం కాదనే ఆలోచనకు వచ్చేసింది. తాజాగా  ఎమ్మెల్సీ, మంత్రి  పదవికి ఆయన ఈ రోజు రాజీనామా చేసిన అనంతరం విలేకర్లతో మాట్లాడారు.

 

నా ఇరవై ఏళ్ల రాజకీయ అనుభవంతో రాష్ట్రాభివృద్ధికి రాజ్యసభలో నా వంతు పాత్ర నేను పోషిస్తాను. మంత్రిగా నేను బాగా పనిచేశాను.. జగన్ నాకు పూర్తి స్వేచ్చ ఇచ్చారు.  ఏపిలో ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల కష్ట సుఖాలు స్వయంగా చూసిన వైఎస్ జగన్ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.. ఆ మాటలు ఇప్పుడు పథకాల ద్వారా నిలబెట్టుకుంటున్నారని.. ఆయన పాలనలో మేమే కాదు.. ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారని పిల్లి సుభాష్ అన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు అంశాన్ని ప్రస్తావిస్తూ పార్టీ జెండాపై గెలిచిన వాళ్లు పార్టికి విధేయతతో ఉండాలని అన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: