ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిమెంట్ సరఫరా కోసం ప్రభుత్వం ఒక సరికొత్త యాప్ ని సిద్ధం చేసింది. వైయస్ నిర్మాణ్ యాప్ పేరుతో రూపొందించిన ఒక మొబైల్ యాప్ తో ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ సరఫరా చేయనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.
తాజాగా వైయస్ నిర్మాణ్ యాప్ ను మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. మంగళగిరి ఏపీఐఐసీ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన వైయస్ నిర్మాణ్ మొబైల్ యాప్ ద్వారానే సిమెంట్ అమ్మకాలు జరుగుతాయని స్పష్టం చేశారు. సకాలంలో సిమెంటు పంపిణీ చేసేలా ఈ యాప్ ని రూపొందించినట్లు తెలిపారు.