ఇటీవల గుంటూరు జిల్లా గురజాలలో జరిగిన ఒక హత్యపై ఇప్పుడు టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైసీపీ సర్కార్ ఈ హత్య చేయించింది అంటూ టీడీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు.

 

 దళితులు, బీసీలు తొలి నుంచి టీడీపీకి అండగా ఉన్నారని ఆయన అన్నారు. టీడీపీ వారిని కాపాడుకుంటుందని ఆయన పేర్కొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక విధ్వంసకర పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. సిఎం జగన్ తన తాతని ఏపీ ప్రజలకు గుర్తు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కుల, మత రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అభివృద్ధిని పూర్తిగా మరిచారన్న ఆయన... నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలతో జగన్ సిగ్గు తెచ్చుకోవాలని ఆయన ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: